Search Forum
Blog Entry# 1960965
Posted: Aug 13 2016 (01:42)
No Responses Yet
No Responses Yet
విజయవాడ సిటీ: పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలోని పుష్కరనగర్లో శుక్రవారం రైల్వే ఛీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎం సర్జనరావు వైర్లెస్ టిక్కెట్ కౌంటర్ ప్రారంభించారు. ఈ కౌంటర్లో అన్ని ప్రాంతాలకూ టికెట్లు విక్రయించనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు సూచన మేరకు 2106 కృష్ణవేణి పుష్కరమహోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలో తొలిసారిగా నగరంలో వైర్లెస్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మరో ఐదు పుష్కర నగర్లలోనూ టికెట్ కౌంటర్లు ప్రారంభించనున్నామని, 12 రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా తెలియచేశారు. యాత్రికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు