Search Forum
Blog Entry# 2340679
Posted: Jul 03 2017 (12:30)
No Responses Yet
No Responses Yet
దిల్లీ: రైల్వే ఉద్యోగుల ఏకరూప దుస్తులు (యూనిఫారం) మారనున్నాయి. ప్రయాణికులతో నిత్యం సంబంధాలు ఉండే సిబ్బందికి కొత్త తరహా దుస్తులు ఇవ్వాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రితూ బేరి వీటిని రూపొందించారు. కార్యాలయ ఉద్యోగులు, స్టేషన్ మాస్టర్లు, టీటీఈలు, గార్డులు, డ్రైవర్లు, ఆహార సరఫరా సిబ్బందికి వేరువేరుగా దుస్తుల నమూనాలను ఆమె తయారు చేశారు. ఈ దుస్తులు మెరుపు జాకెట్లు, టీ షర్టుల రూపంలో ఉన్నాయి. దుస్తులపై రైల్వే లోగో ఉంటుంది. అక్టోబరు నుంచి దీన్ని అమలు చేసే ఆలోచన ఉంది. దాదాపు అయిదు లక్షల మంది ఉద్యోగులకు వీటిని అందజేస్తారు. ప్రస్తుతం స్టేషన్ మాస్టర్లు, టీటీఈలు ధరిస్తున్న ఏకరూపదుస్తులను ఎన్నో ఏళ్ల క్రితం రూపొందించారు. వర్కుషాపుల్లో ఉన్న సిబ్బందికి కూడా కొత్త తరహా ఏకరూప దుస్తులు ఇవ్వనున్నారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేసిన ప్రకటన మేరకు కొత్త తరహా దుస్తులకు రూపకల్పన చేశారు. అన్నింటినీ పరిశీలించిన తరువాత ఖరారు చేస్తామని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
ఫ్రంట్ ఆఫీసు ఉద్యోగులు: కార్యాలయాల్లో పనిచేసే వారి కోసం నలుపు, పసుపు రంగుల్లో ఉన్న టీ...
more...
ఫ్రంట్ ఆఫీసు ఉద్యోగులు: కార్యాలయాల్లో పనిచేసే వారి కోసం నలుపు, పసుపు రంగుల్లో ఉన్న టీ...
more...