Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Ranikhet Express - रेगिस्तान में हरियाली

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 1227375
Posted: Sep 28 2014 (16:29)

25 Responses
Last Response: Sep 28 2014 (17:34)
General Travel
2546 views
1

Sep 28 2014 (16:29)   TPTY/Tirupati (6 PFs)
 
Jagan Mohan Reddy
Jagan Mohan Reddy   1835 blog posts
Entry# 1227375            Tags   Past Edits
TUDA planned to constrct mono rail to Tirumala too...if this happend one can go to Tirumala by train
తిరుపతి నుంచి తిరుమలకు సురక్షితంగా భక్తులను చేర్చడానికి మోనో రైలును ఏర్పాటుచేయాలని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ప్రతిపాదించింది. రూ.3,510 కోట్లతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రణాళిక నివేదిక)ను రూపొందించింది. ప్రాజెక్టును చేపట్టేందుకు ఆర్థిక సహాయం చేయాలని తుడా అధికారులు కేంద్రానికి నివేదిక పంపారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి
...
more...
విరాజిల్లుతోంది. తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాల ద్వారా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రతి రోజూ ఆర్టీసీ బస్సులు మొదలు ద్విచక్ర వాహనాల వరకూ మొత్తం పదివేల వాహనాల్లో 65 వేల మంది భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. వాహనాలు అధికమవుతుండడం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య తీవ్రమై ప్రమాదాలకు దారి తీస్తోంది.
భారీ వర్షాలు కురిసినపుడు కొండచరియలు విరిగి పడడం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. భక్తులను సులభంగా ఏడుకొండల స్వామి వద్దకు చేర్చడానికి తుడా అనేక మార్గాలను అన్వేషించింది. అందులో రోప్ వే ఒకటి. రోపే వే పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో.. మోనో రైలుపై తుడా అధికారులు కసరత్తు చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు 27 కిమీల దూరం ఉంటుంది. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు మార్గాన్ని ఏర్పాటుచేయడానికి నిపుణులతో కలిసి తుడా అధికారులు సర్వే చేశారు. తిరుమల ఘాట్ రోడ్డు వెంబడే రైలు మార్గాన్ని నిర్మించడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తేల్చారు. ఇప్పటికే రోడ్డు మార్గం ఉండటంతో ఆ పక్కనే మోనో రైలు మార్గాన్ని నిర్మించడానికి అటవీశాఖ అనుమతులు కూడా సులభంగా వస్తాయని అంచనా వేశారు.

ఈ క్రమంలోనే మోనో రైలు ప్రాజెక్టును చేపట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించడానికి పూర్తి స్థాయిలో సర్వే చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు రైలు మార్గం నిర్మించడానికి.. తొలి దశలో ఆరు మోనో రైలు ఇంజిన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ.3,510 కోట్లు అవసరం అవుతాయని తేల్చారు. ప్రస్తుతం తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ సముదాయంలో ఉన్న తిరుమల బస్‌స్టేషన్‌ను మోనో రైల్వే స్టేషన్‌గా మార్చాలని ప్రతిపాదించారు. కపిలతీర్థం వద్ద ఓ రైల్వే స్టేషన్.. అలిపిరి వద్ద మరో రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించారు. మోనో రైలు ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు తుడా అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ యాజమాన్యం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేయాలని నివేదిక పంపారు. మోనో రైలు ప్రాజెక్టు భారీ వ్యయంతో కూడినది కావడంతో కేంద్రంపైనే తుడా అధికారులు ఆశలు పెంచుకున్నారు.

ఈనెల 15న తిరుపతి ఎంపీ వి.వరప్రసాదరావు తుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు మోనో రైల్వే ప్రాజెక్టు విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నిధులు వచ్చేలా చూడాలని కోరారు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ.. ఆ ప్రాజెక్టు నివేదికను తనకు ఇవ్వడంతోపాటు కేంద్రానికి, టీటీడీ బోర్డుకు పంపాలని ఆదేశించారు. తుడా అధికారులు ఈనెల 16న ఎంపీ వరప్రసాదరావుకు మోనో రైల్వే ప్రాజెక్టు నివేదికను అందించారు. అదే రోజున కేంద్ర ప్రభుత్వానికి, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌కు నివేదిక పంపారు. మోనో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరిస్తే.. తక్కిన 50 శాతం టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం, తుడా భరించేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు స్పష్టీకరిస్తున్నారు. ఏదిఏమైనా మోనో రైల్వే ప్రాజెక్టు సాకారమైతే తిరుమలకు భక్తుల రవాణా కష్టాలు తీరినట్లే
click here

Translate to English
Translate to Hindi

2 Public Posts - Sun Sep 28, 2014

287 views
1

Sep 28 2014 (16:56)
guest   7302 blog posts
Re# 1227375-3              
This will never happen as the sanctity of the temple would be lost. This would turn to be a tourism place than a piligrim center.
Translate to English
Translate to Hindi

22 Public Posts - Sun Sep 28, 2014
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy