Search Forum
Blog Entry# 1725901
Posted: Jan 31 2016 (19:21)
4 Responses
Last Response: Jan 31 2016 (19:47)
4 Responses
Last Response: Jan 31 2016 (19:47)
కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న కాపులు తుని రైల్వేస్టేషన్లో ఆందోళన చేపట్టారు. ఆదివారం మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో కాపు ఐక్యగర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ డిమాండ్ నెరవేర్చే వరకు రైల్రోకో, రాస్తారోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆందోళనకారులు తుని రైల్వేస్టేషన్కు చేరుకుని.. ఆ సమయంలో అక్కడే ఆగివున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను ముట్టడించారు.
ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఓ బోగీకి నిప్పు పెట్టారు. ఒక బోగీ తర్వాత మరో బోగీకి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై కిందికి దిగిపోయారు. మంటల తీవ్రతతో కాసేపటికే రైలు మొత్తం దగ్ధమైంది. ఆందోళనకారులను నియంత్రించేందుకు వచ్చిన నలుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాధ్యం కాలేదు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన ఇతర ప్రాంతాల నుంచి బలగాలను రప్పిస్తున్నారు.
తాజా...
more...
ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఓ బోగీకి నిప్పు పెట్టారు. ఒక బోగీ తర్వాత మరో బోగీకి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై కిందికి దిగిపోయారు. మంటల తీవ్రతతో కాసేపటికే రైలు మొత్తం దగ్ధమైంది. ఆందోళనకారులను నియంత్రించేందుకు వచ్చిన నలుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాధ్యం కాలేదు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన ఇతర ప్రాంతాల నుంచి బలగాలను రప్పిస్తున్నారు.
తాజా...
more...
రత్నాచల్ ఎక్స్ప్రెస్పై ఆందోళనకారుల దాడి ఘటనలో రైలు డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించి భారీ ప్రమాదాన్ని నివారించాడు. ఆందోళనకారులు రైలును ఆపి బోగీలపైకి ఎక్కుతుండటాన్ని గమనించిన డ్రైవర్... సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్ నిలిపివేయించాడు. దీంతో సిబ్బంది తక్షణమే విద్యుత్ నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది.
3 Public Posts - Sun Jan 31, 2016