Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

हम RailFan - हमेशा पंखों पे

Search Forum
Filters:
Page#    4 Blog Entries  
Rail News
45834 views
1

Mar 15 (04:31)   విశాఖను వదిలి రైలెళ్లి పోతోంది..!

NaagendraV   32 news posts
Entry# 5998927   News Entry# 545237         Tags   Past Edits
దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు
రాష్ట్రంలోనే...

Rail News
47464 views
1

Mar 15 (04:32)
NaagendraV
NaagendraV   290 blog posts
Re# 5998927-1              
Article source:

దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు

రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు.
...
more...


దువ్వాడ మీదుగా 35 సర్వీసుల రాకపోకలుదక్షిణ కోస్తా రైల్వేజోన్‌ రాకపోవడమే కారణంఐదేళ్లుగా పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం

చలువతోట(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు. మరో పక్క వారంలో 35 వరకు రైళ్లు విశాఖ రాకుండా దువ్వాడ స్టేషన్‌ మీదుగా వెళ్లిపోతున్నాయి. విశాఖలో తగినన్ని ప్లాట్‌ఫాంలు లేకపోవడం, స్టేషన్‌లోకి వచ్చిన ప్రతి రైలు, ఇంజిన్‌ మార్చుకుని బయలుదేరాలంటే 20 నిమిషాలకుపైగా సమయం పట్టడం దీనికి కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి బల్బ్‌ స్టేషన్‌, మర్రిపాలెం స్టేషన్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సాకారమై ఉంటే వాటిల్లో ఒక్కటైనా పట్టాలెక్కేది. కాని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జోన్‌ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

రైల్వే జోన్‌ వచ్చి ఉంటే..

‘బల్బ్‌ స్టేషన్‌ అభివృద్ధికి అవసరమైన స్థలం ఇవ్వడానికి పోర్టు అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం కష్టమే. అయితే కొంచెం దృష్టిపెడితే మర్రిపాలెం స్టేషన్‌ను అభివృద్ధి చేయవచ్చు. గతంలో దీన్ని టెర్మినల్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. ఈ మేరకు కొన్ని పనులు కూడా చేశారు. తర్వాత ఏమైందో ఏమో అది అటకెక్కింది. ఇక్కడ నాలుగైదు ప్లాట్‌ఫారాలు నిర్మిస్తే చాలు.. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లను ఇక్కడి నుంచి పంపించవచ్చు. తద్వారా దువ్వాడ మీదుగా వెళ్లే రైళ్లను విశాఖకు మళ్లించవచ్చ’ని ఎప్పటి నుంచో రైల్వే వినియోగదారుల సంక్షేమ సంఘం చెబుతోంది. రైల్వే జోన్‌ సాకారమై ఉంటే ఈ ప్రతిపాదన పట్టాలెక్కి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా విశాఖ నుంచి మరిన్ని కొత్త రైళ్లను నడిపే అవకాశం ఉండేదని, కేవలం జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు మంచి అవకాశం కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్థలం విషయంలో ప్రభుత్వం దొంగాట..

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు అవసరమైన స్థలం కేటాయింపులో వైకాపా ప్రభుత్వం దొంగాట ఆడింది. ముడసర్లోవలో సుమారు 52 ఎకరాల స్థలం కేటాయించామని, రైల్వే అధికారులే తీసుకోలేదని చెప్పింది. వాస్తవంగా ఆ స్థలం రిజర్వాయరు పరివాహక ప్రాంతంలో ఉండడంతో తెదేపా హయాంలో అప్పటి కలెక్టర్‌ యువరాజ్‌ నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో పట్టాలు కలిగి ఉన్న గిరిజనులను ఖాళీ చేయించారు. వీటన్నింటినీ దాచిపెట్టిన వైకాపా ప్రభుత్వం స్థలం ఇచ్చేసినట్లు నమ్మబలికింది. చివరికి రైల్వేశాఖ మంత్రి లోక్‌సభలో వాస్తవాలు చెప్పడంతో జగన్‌ ప్రభుత్వ దొంగాట బయటపడింది. రైల్వేజోన్‌ సాకారమై ఉంటే రైల్వేబోర్డు వచ్చేదని, విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి మంచి జరిగేదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది రాష్ట్ర యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది.

#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE

Translate to English
Translate to Hindi
Rail News
36295 views
0

Mar 10 (05:21)   రాష్ట్రం వాటా ఇవ్వదు... పనులు సాగవు

NaagendraV   32 news posts
Entry# 5992529   News Entry# 544462         Tags   Past Edits
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. ...

Rail News
34824 views
0

Mar 10 (05:23)
NaagendraV
NaagendraV   290 blog posts
Re# 5992529-1              
Article Source:

ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు.

చించినాడ
...
more...
నుంచి దిండి వరకు వశిష్ఠ గోదావరిపై అసంపూర్తిగా రైలు వంతెన నిర్మాణ పనులు

ఈనాడు, ఏలూరు: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. 57.21 కి.మీ. పనులు చేపట్టే ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించిన మూడు వంతెనల్లో మొదటిది పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా దిండి వరకు వశిష్ఠ గోదావరిపై 20 పిల్లర్లతో వంతెన నిర్మాణం. రెండోది ముక్తేశ్వరం-కోటిపల్లి మధ్య గౌతమి నదిపై 45 పిల్లర్లతో నిర్మాణం.  వైనతేయ నదిపై 21 పిల్లర్లతో పాసర్లపూడి- బోడసకుర్రు మూడో వంతెన పనులు చేపట్టారు. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.పనులు పూర్తయితే కోనసీమ రైల్వేలైను ఏర్పడుతుంది. మెయిన్‌లైన్‌ ట్రాఫిక్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుంది.

నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం బ్రిటిష్‌ హయాంలో ప్రతిపాదించారు. చాలా ఏళ్లు  సర్వేలకే పరిమితమైంది. అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి  తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. అనంతరం రూ.2,120 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం తన వాటాగా రూ.525 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం తనవాటా నిధులు ఇవ్వక, భూసేకరణ కొలిక్కిరాక ప్రాజెక్టు పడకేసింది.


#BZA #SCOR #Aprailwayinfra #andhrarailwayinfra
#CCT #NS

Translate to English
Translate to Hindi

2 Public Posts - Sun Mar 10, 2024

1 Public Posts - Sat Mar 16, 2024
Rail News
32864 views
0

Jan 04 (11:17)   UCV writes letter to Railway minister to arrange stakeholders meet on Waltair Division

NaagendraV   32 news posts
Entry# 5931715   News Entry# 536204         Tags   Past Edits
VISAKHAPATNAM: Uttarandhra Chaitanya Vedika (UCV) requested the Union Minister for Railways to speed up the operationalization of the new railway zone as it was getting delayed...

Rail News
33265 views
0

Jan 04 (11:21)
NaagendraV
NaagendraV   290 blog posts
Re# 5931715-1              
Article source :

VISAKHAPATNAM: Uttarandhra Chaitanya Vedika (UCV) requested the Union Minister for Railways to speed up the operationalization of the new railway zone as it was getting delayed due to the alienation of land by the state government. It has also been mentioned in the letter that there is a demand for Keeping the Waltair Railway Division in the new South Coast Railway Zone.
...
more...

A stakeholders meeting should be convened on the Waltair Division issue, the UCV requested.The Convenor of UCV, SS Shiva Sankar informed that there is a large chunk of railway land available adjacent to the railway station which can be used for the New Railway Zone headquarters. The UCV reminded that the land had already been identified in the wireless colony for which even architecture designs and Detailed Project Report (DPR) were ready. He mentioned that railways should go ahead with the available land immediately without waiting for the land from the state government.

#BZA #VSKP #GTL #GNT #SCOR #Southcoastrailwayzone #Andhrarailwayinfra #OperationsScor #Aprailwayinfra

Translate to English
Translate to Hindi
Rail News
118865 views
2

Dec 20 2023 (09:47)   Visakhapatnam: జోన్‌ ఏర్పాటులో రైల్వేశాఖ తాత్సారం

NaagendraV   32 news posts
Entry# 5916734   News Entry# 534521         Tags   Past Edits
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటులో మంత్రిత్వశాఖ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నట్లు లోక్‌సభ హామీల కమిటీ ఆక్షేపించింది. ...

Rail News
118431 views
1

Dec 20 2023 (09:49)
NaagendraV
NaagendraV   290 blog posts
Re# 5916734-1               Past Edits
1 compliments
Great
article source :

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటులో మంత్రిత్వశాఖ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నట్లు లోక్‌సభ హామీల కమిటీ ఆక్షేపించింది.

తీసుకున్న
...
more...
చర్యలు సంతృప్తికరంగా లేవుపార్లమెంటు హామీల కమిటీ ఆక్షేపణనిర్దిష్ట గడువుతో కూడిన కార్యాచరణ అమలుచేయాలని ఆదేశం

ఈనాడు, దిల్లీ: విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్‌ (South Coast Railway zone) ఏర్పాటులో మంత్రిత్వశాఖ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నట్లు లోక్‌సభ హామీల కమిటీ ఆక్షేపించింది. మంగళవారం సభకు సమర్పించిన నివేదికలో ఈ విషయంలో రైల్వేశాఖ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. దక్షిణకోస్తా రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటు గురించి 2020 మార్చి, 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌ సభ్యులు అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి సమాధానమిస్తూ డీపీఆర్‌ తయారైందని, అది రైల్వేబోర్డు పరిశీలనలో ఉందని, అందువల్ల నిర్దిష్ట గడువు చెప్పలేమని పేర్కొన్నారు. ఈ హామీ అమలుపై అధ్యయనం చేసిన కమిటీ మూడేళ్లుగా రైల్వేశాఖ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘దక్షిణకోస్తా రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగినట్లు కమిటీ గుర్తించింది. ఈ సమస్య నిరంతరం కొనసాగుతోంది. డీపీఆర్‌ ఇప్పటికీ ఇంకా రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలనలోనే ఉంది. దాని ఖరారుకు కొంత సమయం పడుతుందన్న విషయాన్ని కమిటీ అర్థం చేసుకుంది.

ఇంత ముఖ్యమైన హామీలో మూడేళ్లకు పైగా జాప్యాన్ని కమిటీ అంగీకరించట్లేదు. అది రైల్వే మంత్రిత్వశాఖ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. వాల్తేరు డివిజన్‌ మూసివేత గురించి ప్రజాప్రతినిధులతో పాటు, వివిధ భాగస్వామ్యపక్షాలతో చర్చించి సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. దీనిపై మంత్రిత్వశాఖ సమాధానంతో కమిటీ సంతృప్తి చెందడంలేదు. రైల్వేజోన్‌ అంశాన్ని పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులంతా సభలోనూ, బయట ప్రస్తావిస్తున్నారు. మౌలికవసతుల పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయడం కష్టమని కమిటీకి తెలుసు. ఇదే సమయంలో హామీలు నెరవేర్చడానికి రైల్వేశాఖ ప్రయత్నాలు చేయలేదన్నది నిజం. ఇప్పటికైనా రైల్వేశాఖ అన్ని పక్షాలతో సమన్వయం చేసుకొని, హామీల అమలుకు నడుం బిగించాలి. రాయగడ డివిజన్‌ ఏర్పాటుతో ఆ జిల్లాలో పారిశ్రామిక, సామాజిక, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అందువల్ల రైల్వేశాఖ వెంటనే దక్షిణకోస్తా రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకు నిర్దిష్ట గడువుతో కూడిన కార్యాచరణను తయారుచేసి అమలుచేయాలి’’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

#southcoastrailwayzone #bza #gnt #gtl #aprailwayinfra #ap_railway_infra #vskprailwayzone #andhra_railway_infra #SCOR

Translate to English
Translate to Hindi
Page#    4 Blog Entries  

Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy