Search Forum
Blog Entry# 3269717
Posted: Apr 04 2018 (17:51)
No Responses Yet
No Responses Yet
ఢిల్లీ : ఎపిలోని నాలుగు రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా లభించింది. రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లతో పాటు రాయలసీమలోని కర్నూలు, గుంతకల్లు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఒక్కో రైల్వే డివిజన్ నుంచి ఒక స్టేషన్ను ఎంపిక చేసి, అత్యాధునిక సౌకర్యాలు కలిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఒక్కో రైల్వేస్టేషన్కు రూ.25 కోట్లు కేటాయించారు. ఆయా స్టేషన్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో ప్రతిపాదనలు పంపాలని ఆయా డివిజన్ల అధికారులకు రైల్వేబోర్డు ఆదేశాలు ఇచ్చింది.