Search Forum
Blog Entry# 4554579
Posted: Feb 01 2020 (11:51)
No Responses Yet
No Responses Yet
Feb 01 2020 (11:51)
patcher~
patcher~ 165 blog postsEntry# 4554579 Past Edits
Feb 01 2020 (11:52)
నిధులు కూత లేక కూసేనా ముందుకు సాగని కోటిపల్లి
~##~ సర్వేకే పరిమితమైన భద్రాచలం
ఎనిమిదేళ్లయినా
ఇంకా పూర్తికాని డబ్లింగ్పనులు
నరసాపురం, జనవరి 31 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టే బడ్జెట్పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు
ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఈసారి జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తారని ఎదురుచూస్తున్నారు
నిర్మలా సీతారామన్ నరసాపురం కోడలు కావడంతో మంత్రికి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపె అవగాహన ఉంది
ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో కొత్త రైళ్ళకు పచ్చజెండా ఊపడంతో పాటు కోటిపల్లి- నరసాపురం, కొవ్వూరు- భద్రాచలం, విజయవాడ- నరసాపురం డబ్లింగ్ పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారన్న ఆశ జిల్లావాసుల్లో నెలకొంది
కొత్త రైళ్ల ప్రతిపాదన
రాష్ట్ర విభజన తరువాత విజయవాడ రైల్వే డివిజన్లో అత్యంత వేగంగా అభివృద్థి చెందిన స్టేషన్ నరసాపురం
పుష్కలంగా నీరు, రైల్వేకు సంబంధించిన స్థలం ఎక్కువుగా ఉండటంతో గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈ స్టేషన్ను వేగంగా అభివృద్ధి చేశారు
కోచ్ల మరమ్మతు షెడ్తో పాటు ఫిట్లైన్ మంజూరు చేశారు
కొత్త రైల్వేస్టేషన్ కూడా నిర్మిస్తున్నారు
త్వరలో నరసాపురం నుంచి వరాణశి, బెంగళూరు రైళ్లను నడపుతామని ఇటీవల రైల్వే డీఆర్ఎం ప్రకటించారు
ఇది కాకుండా ప్రస్తుతం లింకులతో నడుస్తున్న తిరుపతి, మచిలీపట్నం, తిరుపతి- ధర్మవరం రైళ్లను నరసాపురం నుంచే నేరుగా నడపాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్లో ఉన్నాయి
ఈ బడ్జెట్లో వీటికి పచ్చజెండా ఊపుతారని ఎదురుచూస్తున్నారు
కోటిపల్లి- నరసాపురం
బ్రిటిష్ హయాం నుంచి పెండింగ్లో ఉన్న నరసాపురం- కోటిపల్లి రైల్వేలైన్కు ఏన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తూ వస్తున్నది
ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు రూ
1000 కోట్లు కేటాయించారు
అయితే ఈమొత్తం భూసేకరణకే సరిపోయింది
ప్రాజెక్టు చేపట్టి ఆరేళ్లు పైగా గడిచినా ఇంత వరకు అర కిలోమీటర్ కూడా పట్టా వేయలేదు
కోటిపల్లి-ముక్తేశ్వరం వద్ద గౌతమి నదిపై నిర్మించిన భారీ వంతెన ఇంకా పిల్లర దశలోనే ఉంది
అలాగే పాశర్లపూడి వద్ద వైనతేయ, చించినాడ వద్ద వశిష్ఠ వద్ద నిర్మించే వంతె నలు కూడా ఇంకా పిల్లర్ దశలోనే ఉన్నాయి
ఈ మూడు వంతెనలకు సుమారు రూ
1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
51 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ పను లకు రూ
2,120 కోట్లు అంచనా వేశారు
అయితే ఆలస్యం అవడంతో అంచనా వ్యయం పెరిగింది
గత బడ్జెట్లో ఈప్రాజెక్టుకు రూ
323 కోట్లు కేటాయించారు
ఈసారి పెంచుతారన్న ఆశ గోదావరి వాసుల్లో నెలకొంది
కొవ్వూరు- భద్రాచలం
ఈప్రాజెక్టు కూడా దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది
ప్రతి బడ్జెట్లోనూ సర్వేకే నిధులు కేటాయిస్తున్నారు
గత బడ్జెట్లోనూ ఇదే జరిగింది
131 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ కొత్త లైన్ వల్ల జిల్లాలో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెంలకు రైల్వేమార్గం ఏర్పడుతుంది
అంతే కాకుండా విశాఖ నుంచి హైద్రాబాద్ వెళ్లే రైళ్ళకు దగ్గరమార్గం ఏర్పడుతుంది
నిడదవోలు-ఏలూరు మెయిన్ లైన్పై ట్రాఫిక్ తగ్గుతుంది
గూడ్స్ రైళ్ళకు ఈ మార్గం ఎంతో సౌకర్యంగా ఉంటుంది
ఈసారి బడ్జెట్లోనైనా నిధులు ఇస్తారన్న ఆశ మెట్టప్రాంత వాసుల్లో నెలకొంది
విజయవాడ- నరసాపురం డబ్లింగ్
ఈ ప్రాజెక్టు పనులు 2012లో చేపట్టారు
221 కిలోమీటర్ల డబ్లింగ్ పనుల్ని ఐదు విభాగాలుగా విభజించారు
అంచనా వ్యయం రూ
1504 కోట్లు
అయితే ఎనిమిదేళ్లు గడిచినా పనులు ముందుకు సాగకపోవడంతో నిర్మాణ వ్యయం పెరిగింది
ఇప్పటివరకు గుడివాడ స్టేషన్కు సమీపంలో ఉన్న మోటూరు నుంచి భీమవరం వరకు అంటే 49 కిలోమీటర్ల మేర డబ్లింగ్ లైన్ పనులు పూర్తయ్యాయి
ఇటు భీమవరం-నిడదవోలు 36 కిలోమీటర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి
అలాగే భీమవరం-నరసాపురం మధ్య 29 కిలోమీటర్ల పనులకు కూడా నిధుల కొరత ఉంది
గుడివాడ నుంచి విజయవాడల మధ్య 49 కిలోమీటర్ల పనులు కూడా మధ్యస్థంగా ఉన్నాయి
2021 నాటికి ఈప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
గత బడ్జెట్లో దీనికి కేవలం రూ
175 కోట్లు కేటాయించారు
ఈసారి ఏం చేస్తారో చూడాలి ~!~
Feb 01 2020 (11:52)
FM Approval by: Vageesh^~/1766013
~#
Feb 01 2020 (11:52)
FM Approval by: Vageesh^~/1766013