Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Chetak Express: - यार तेरा चेतक पे चले ❤️ - Keshav Saxena

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 4554906
Posted: Feb 01 2020 (16:13)

No Responses Yet
General Travel
1259 views
0

Feb 01 2020 (16:13)  
patcher~
patcher~   165 blog posts
Entry# 4554906               Past Edits
నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్‌
రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులపై జిల్లావాసుల్లో ఆసక్తి
కోటిపల్లి-నరసాపురం, పిఠాపురం-కాకినాడ లైన్లకు మోక్షం కలిగేనా?
కాకినాడ-కోటిపల్లి మధ్య నిలిచిన రైలుబస్సు
రైల్వేస్టేషన్ల
...
more...
ఆధునికీకరణ, విస్తరణ జరిగేనా?
(ఆంధ్రజ్యోతి,అమలాపురం): పార్లమెంట్‌లో శనివారం ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉంటాయనే అంశంపై జిల్లా ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రధానమైన రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపుతోపాటు జిల్లాలోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పనపై ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌తోపాటు దశాబ్ధాలకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న కాకినాడ-పిఠాపురం మెయిన్‌లైన్‌ అనుసంధానాలు అందని ద్రాక్షలా మిగిలాయి. అరకుకు చెందిన ఎంపీతోపాటు జిల్లాలోని ముగ్గురు పార్లమెంటు సభ్యులు వైసీపీ నుంచి ఎన్నికైనా రైల్వే వ్యవహారాలపై పెద్దగా దృష్టిసారించని పరిస్థితి నెలకొంది.

కేటాయింపులు ఉండేనా..?
లోక్‌సభలో శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21కు సంబంధించిన ఆర్థిక బడ్జెట్‌తోపాటు రైల్వేబడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు ఎలా ఉంటుందనే దానిపై ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. ప్రధానంగా కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌తోపాటు కాకినాడ-పిఠాపురం మెయిన్‌లైన్‌ అనుసంధానానికి కేటాయింపులు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశమైంది. విజయవాడ-విశాఖపట్నం మధ్య మన జిల్లా మీదుగా మూడోలైన్‌ ఏర్పాటుతోపాటు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు-భద్రాచలం మధ్య రైలుమార్గం నిర్మాణ ప్రతిపాదనలు ప్రశ్నార్థకంగానే మారాయి.

కాకినాడ-కోటిపల్లి రైల్వేలైన్‌ పునరుద్ధరించినా ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో రైలుమార్గం బస్సుగా మారింది. ఆ రైలుబస్సు కాస్తా ఏప్రిల్‌ 23నుంచి నిలిపివేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో కాకినాడ-కోటిపల్లి రైలుమార్గం ప్రస్తుతం నిరుపయోగమైంది. కోటిపల్లినుంచి నరసాపురం వరకు నిర్మించతలపెట్టిన రైలుమార్గం ఏర్పాటులో భూసేకరణ పెద్ద అవరోధంగా మారింది. గౌతమి నదిపై కోటిపల్లి-శానపల్లిలంక మధ్య, పాశర్లపూడి-బోడసకుర్రు మధ్య వైనతేయ నదిపైన, దిండి-నరసాపురం మధ్య వశిష్ట నదిపైన వారథుల నిర్మాణ పనులను రైల్వేశాఖ చేపట్టింది.

రూ.2వేల కోట్లకు పైబడిన అంచనాలు..
కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌ నిర్మాణపనులకు రూ.2వేల కోట్లకు పైబడిన అంచనాలను రూపొందించారు. గడచిన నాలుగు రైల్వేబడ్జెట్‌ల్లో రూ.1030కోట్లను రైల్వేశాఖ కేటాయించగా ప్రాజెక్టు నిధుల్లో 25శాతం మేర రాష్ట్ర ప్రభుత్వవాటాగా రూ.126 కోట్లు కేటాయించారు. వెరసి రూ.1156కోట్లను ఇందుకోసం కేటాయించగా రూ.350కోట్లతో వారధి పనులు కొనసాగుతున్నాయి. గతంలో కోటిపల్లి-భట్నవిల్లి మధ్య ట్రాక్‌ నిర్మాణం కోసం 154 ఎకరాలను అధికారులు సేకరించారు. భట్నవిల్లి నుంచి పాశర్లపూడి, రాజోలు, దిండి వరకు ఇప్పుడు భూసేకరణ పెద్ద సమస్యగా మారింది. గతంలో ల్యాండ్‌ ఎక్విజేషన్‌ కోసం రూ.వంద కోట్లను రైల్వేశాఖ కేటాయించినా భూసేకరణ విషయంలో అవరోధాలు కొనసాగుతున్నాయి.

ప్రధాన వంతెనల నిర్మాణాలు జరుగుతున్నా కోనసీమ ప్రాంతంలో మరో 185 పెద్ద, చిన్న వంతెనలు, కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. వారధులతోపాటు ట్రాక్‌ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు కేటాయిస్తే సాధ్యమైనంత త్వరగా ఈ రైల్వేమార్గం ప్రయాణికులకు చేరువలోకి వస్తుందనేది కోనసీమ ప్రజల ఆకాంక్ష. గత రెండు బడ్జెట్‌ల్లో రూ.200కోట్లు చొప్పున కేటాయించినా నిధులు వినియోగంలోకి రాలేదు.

ఎంపీల్లో ఏదీ సమన్వయం..
జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులంతా వైసీపీకి చెందినవారే ఎన్నికైనప్పటికీ ప్రధాన సమస్యలపై సమన్వయలోపం కారణంగా దృష్టిసారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌ రైల్వేసమస్యలపై ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాకినాడ, అమలాపురం మహిళా ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ ఆయా నియోజకవర్గాల్లో రైల్వేమార్గాల ఏర్పాటుపై ఇప్పటికే అధికారుల దృష్టికి వినతిపత్రాల రూపంలో తీసుకెళ్లారు.

రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో నెగ్గిన వైసీపీ ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖకు స్పష్టమైన ప్రతిపాదనలు ఇవ్వలేకపోవడంవల్ల ప్రభుత్వం సైతం రైల్వేప్రాజెక్టుల ప్రగతిపై పెద్దగా దృష్టి సారించలేదనేది ప్రధాన ఆరోపణ. జిల్లాలోని తుని, కాకినాడ, సామర్లకోట, ద్వారపూడి, రాజమహేంద్రవరంలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధికోసం నిధులు కేటాయించాలని ఈప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు. దశాబ్ధాలనుంచి పెండింగ్‌లో ఉన్న పిఠాపురం-కాకినాడ మెయిన్‌లైన్‌ అనుసంధానానికి మోక్షం కల్పించాలని సూచిస్తున్నారు.
click here title="https://web.archive.org/web/20200201104141/click here rel="nofollow" target="_blank" >click here

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy