Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

RailFanning is a gift you give yourself. - Varun

Search Forum
Filters:
Page#    42 Blog Entries  next>>
Rail News
35488 views
0

Mar 16 (13:57)   కూత కూసినా కదలదండీ.. ఈ రైలు బండి!

NaagendraV   32 news posts
Entry# 6000358   News Entry# 545361         Tags   Past Edits
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్‌కు 2019లో గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ నేటికీ కల సాకారం కాలేదు. దీనికి కారణం ఏంటి....?
(తంగేటి...

Rail News
36564 views
0

Mar 16 (13:58)
NaagendraV
NaagendraV   290 blog posts
Re# 6000358-1              
Article Source:
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్‌కు 2019లో గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ నేటికీ కల సాకారం కాలేదు. దీనికి కారణం ఏంటి....?

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం:
...
more...
విశాఖ రైల్వే జోన్.. .ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ మూడు దశాబ్దాల పాటు పోరాటం చేశారు ఉత్తరాంధ్ర ప్రజలు. పాలకులు మారినా ఫలితం కనిపించలేదు. చివరకు 2019లో రెండోసారి అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం జోన్ ప్రకటన చేసింది. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌గా పేరు పెట్టినప్పటికీ జోన్ ఏర్పాటులో పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. వాల్తేరు డివిజన్‌ను రద్దుచేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం పట్ల ఉత్తరాంధ్ర వాసుల్లో అసంతృప్తి జ్వాల రగులుతూనే ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి డీపీఆర్ ఆమోదానికే రెండేళ్లు పట్టిందంటే పాలకులకు ఉత్తరాంధ్రవాసులపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతుంది.

ప్రకటన చేసి పబ్బం గడుపుకుంది...

2019లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించి పబ్బం గడుపుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ రెండో టర్మ్ కూడా పూర్తి కావస్తున్నా జోన్ వ్యవహారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డీపీఆర్ ఆమోదం జరిగినప్పటికీ ఒక్క పని కూడా మొదలు కాలేదు. దీంతో రైల్వే జోన్‌తో పాటు విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా నిర్లక్ష్యానికి గురైంది. రాకపోకలు సాగించే రైళ్లు పెరిగినా...ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరగకపోవడంతో ఇక్కడి నుంచి రైళ్లు తరలిపోయే దుస్థితి ఏర్పడింది.

విశాఖ వదిలి రైలెల్లిపోతోంది...

ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. పారిశ్రామిక, పర్యాటక రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ నుంచి రాకపోకలు అధికమయ్యాయి. అయితే విశాఖ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు తగినన్ని ప్లాట్‌ఫామ్‌లు లేవు. స్టేషన్లోకి వచ్చిన రైలు ఇంజిన్ మార్చుకుని వెళ్లడానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ కారణంగా స్టేషన్‌కు వచ్చే రైళ్లు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు రైళ్లను దువ్వాడ స్టేషన్ నుంచి మరలిస్తున్నారు. మరిన్ని రైళ్లు దువ్వాడ స్టేషన్ నుంచే ప్రారంభం అవుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దువ్వాడ రైల్వే స్టేషన్‌కి వెళ్లి ట్రైన్ ఎక్కడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రభుత్వాల దోబూచులాట...

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. రైల్వే జోన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత పట్టించుకోవడం మానేసింది. జోన్ కార్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వాల్సి ఉండగా... తాము ఎప్పుడో ఇచ్చాం అంటున్నారు గానీ ఆ స్థలం కనిపించడం లేదు. 'విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. స్థలం కేటాయింపు విషయంలో ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వలేదని కేంద్రం దోబూచులాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలకు ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు' అన్నారు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి. ‘‘రైల్వే జోన్ అంశం ఇప్పటిది కాదు. ఇది నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడుతున్న అంశం. రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం దాన్ని అభివృద్ధి పరచడంలో నిర్లక్ష్యం వహించింది. వాల్తేరు డివిజన్‌ను రద్దుచేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటించడం చాలా దారుణం. దీన్ని ఇప్పటికైనా సవరించి పూర్తిస్థాయి రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకులు చలసాని గాంధీ అన్నారు. ఇప్పటికైనా రైల్వే జోన్ ఏర్పాటు ముందుకు సాగుతుందా? అంటూ ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల ప్రచారాస్త్రంగా రైల్వే జోన్…

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు గత 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారంగానే మిగిలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా రైల్వే జోన్‌నే ప్రయోగించనుందని సమాచారం. విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణతో పాటు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


#BZA #GNT #GTL #VSKP #SCOR #RAILWAYZONE #SOUTHCOASTRAILWAYZONE

Translate to English
Translate to Hindi
Rail News
41357 views
1

Mar 15 (04:31)   విశాఖను వదిలి రైలెళ్లి పోతోంది..!

NaagendraV   32 news posts
Entry# 5998927   News Entry# 545237         Tags   Past Edits
దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు
రాష్ట్రంలోనే...

Rail News
42991 views
1

Mar 15 (04:32)
NaagendraV
NaagendraV   290 blog posts
Re# 5998927-1              
Article source:

దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు

రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు.
...
more...


దువ్వాడ మీదుగా 35 సర్వీసుల రాకపోకలుదక్షిణ కోస్తా రైల్వేజోన్‌ రాకపోవడమే కారణంఐదేళ్లుగా పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం

చలువతోట(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు. మరో పక్క వారంలో 35 వరకు రైళ్లు విశాఖ రాకుండా దువ్వాడ స్టేషన్‌ మీదుగా వెళ్లిపోతున్నాయి. విశాఖలో తగినన్ని ప్లాట్‌ఫాంలు లేకపోవడం, స్టేషన్‌లోకి వచ్చిన ప్రతి రైలు, ఇంజిన్‌ మార్చుకుని బయలుదేరాలంటే 20 నిమిషాలకుపైగా సమయం పట్టడం దీనికి కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి బల్బ్‌ స్టేషన్‌, మర్రిపాలెం స్టేషన్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సాకారమై ఉంటే వాటిల్లో ఒక్కటైనా పట్టాలెక్కేది. కాని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జోన్‌ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

రైల్వే జోన్‌ వచ్చి ఉంటే..

‘బల్బ్‌ స్టేషన్‌ అభివృద్ధికి అవసరమైన స్థలం ఇవ్వడానికి పోర్టు అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం కష్టమే. అయితే కొంచెం దృష్టిపెడితే మర్రిపాలెం స్టేషన్‌ను అభివృద్ధి చేయవచ్చు. గతంలో దీన్ని టెర్మినల్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. ఈ మేరకు కొన్ని పనులు కూడా చేశారు. తర్వాత ఏమైందో ఏమో అది అటకెక్కింది. ఇక్కడ నాలుగైదు ప్లాట్‌ఫారాలు నిర్మిస్తే చాలు.. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లను ఇక్కడి నుంచి పంపించవచ్చు. తద్వారా దువ్వాడ మీదుగా వెళ్లే రైళ్లను విశాఖకు మళ్లించవచ్చ’ని ఎప్పటి నుంచో రైల్వే వినియోగదారుల సంక్షేమ సంఘం చెబుతోంది. రైల్వే జోన్‌ సాకారమై ఉంటే ఈ ప్రతిపాదన పట్టాలెక్కి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా విశాఖ నుంచి మరిన్ని కొత్త రైళ్లను నడిపే అవకాశం ఉండేదని, కేవలం జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు మంచి అవకాశం కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్థలం విషయంలో ప్రభుత్వం దొంగాట..

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు అవసరమైన స్థలం కేటాయింపులో వైకాపా ప్రభుత్వం దొంగాట ఆడింది. ముడసర్లోవలో సుమారు 52 ఎకరాల స్థలం కేటాయించామని, రైల్వే అధికారులే తీసుకోలేదని చెప్పింది. వాస్తవంగా ఆ స్థలం రిజర్వాయరు పరివాహక ప్రాంతంలో ఉండడంతో తెదేపా హయాంలో అప్పటి కలెక్టర్‌ యువరాజ్‌ నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో పట్టాలు కలిగి ఉన్న గిరిజనులను ఖాళీ చేయించారు. వీటన్నింటినీ దాచిపెట్టిన వైకాపా ప్రభుత్వం స్థలం ఇచ్చేసినట్లు నమ్మబలికింది. చివరికి రైల్వేశాఖ మంత్రి లోక్‌సభలో వాస్తవాలు చెప్పడంతో జగన్‌ ప్రభుత్వ దొంగాట బయటపడింది. రైల్వేజోన్‌ సాకారమై ఉంటే రైల్వేబోర్డు వచ్చేదని, విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి మంచి జరిగేదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది రాష్ట్ర యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది.

#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE

Translate to English
Translate to Hindi
General Travel
51193 views
1

Mar 14 (06:01)   12747/Palnadu SF Express | GNT/Guntur Junction (7 PFs)
NaagendraV
NaagendraV   290 blog posts
Entry# 5997526            Tags   Past Edits
గుంటూరు-బీబీనగర్ ( guntur-bibinagar) డబ్లింగ్ పనులలో భాగంగా, సుమారు 853.09 కోట్లరూపాయల అంచనా వ్యయంతో, వలిగొండ-కుక్కడం మధ్య 75 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు త్వరలో ప్రారంభంకానున్నవి.

వలిగొండ వద్ద మూసీవంతెన నిర్మాణం సహా ఈ డబ్లింగ్ పనులు సుమారు 33 నెలల కాలపరిమితితో జరగనున్నవి.

Source
...
more...

Translate to English
Translate to Hindi

1 Public Posts - Thu Mar 14, 2024

1 Public Posts - Sat Mar 16, 2024
Rail News
33671 views
0

Mar 10 (05:21)   రాష్ట్రం వాటా ఇవ్వదు... పనులు సాగవు

NaagendraV   32 news posts
Entry# 5992529   News Entry# 544462         Tags   Past Edits
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. ...

Rail News
32236 views
0

Mar 10 (05:23)
NaagendraV
NaagendraV   290 blog posts
Re# 5992529-1              
Article Source:

ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు.

చించినాడ
...
more...
నుంచి దిండి వరకు వశిష్ఠ గోదావరిపై అసంపూర్తిగా రైలు వంతెన నిర్మాణ పనులు

ఈనాడు, ఏలూరు: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. 57.21 కి.మీ. పనులు చేపట్టే ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించిన మూడు వంతెనల్లో మొదటిది పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా దిండి వరకు వశిష్ఠ గోదావరిపై 20 పిల్లర్లతో వంతెన నిర్మాణం. రెండోది ముక్తేశ్వరం-కోటిపల్లి మధ్య గౌతమి నదిపై 45 పిల్లర్లతో నిర్మాణం.  వైనతేయ నదిపై 21 పిల్లర్లతో పాసర్లపూడి- బోడసకుర్రు మూడో వంతెన పనులు చేపట్టారు. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.పనులు పూర్తయితే కోనసీమ రైల్వేలైను ఏర్పడుతుంది. మెయిన్‌లైన్‌ ట్రాఫిక్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుంది.

నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం బ్రిటిష్‌ హయాంలో ప్రతిపాదించారు. చాలా ఏళ్లు  సర్వేలకే పరిమితమైంది. అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి  తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. అనంతరం రూ.2,120 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం తన వాటాగా రూ.525 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం తనవాటా నిధులు ఇవ్వక, భూసేకరణ కొలిక్కిరాక ప్రాజెక్టు పడకేసింది.


#BZA #SCOR #Aprailwayinfra #andhrarailwayinfra
#CCT #NS

Translate to English
Translate to Hindi

2 Public Posts - Sun Mar 10, 2024

1 Public Posts - Sat Mar 16, 2024
Rail News
28951 views
0

Feb 02 (17:01)   రైల్వే జోన్ కోసం 52.22 ఎకరాలు సిద్దంగా ఉంది: విశాఖ కలెక్టర్ మల్లికార్జున

NaagendraV   32 news posts
Entry# 5959328   News Entry# 539756         Tags   Past Edits
విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  క్లియర్ టైటిల్ తో  52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 
...

Rail News
26965 views
0

Feb 02 (17:39)
NaagendraV
NaagendraV   290 blog posts
Re# 5959328-1               Past Edits
Article source :
విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  క్లియర్ టైటిల్ తో  52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

విశాఖపట్టణం:  విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  ఈ ఏడాది జనవరిలోనే  భూమిని సిద్దంగా ఉంచామని  అధికారులు ప్రకటించారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు  సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే  పనులు ప్రారంభిస్తామని  కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ నెల  1వ తేదీన ప్రకటించారు.ఈ విషయమై  విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ మల్లికార్జున  స్పందించారు. 
...
more...

విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  అవసరమైన  52.22 ఎకరాల భూమి సిద్దం చేసినట్టుగా కలెక్టర్  తెలిపారు. ఈ విషయమై  రైల్వేశాఖకు  లేఖ రాసినా కూడ స్పందించలేదని కలెక్టర్   మాట్లాడారు. 

రైల్వే జోన్ ఏర్పాటు విషయమై భూమి కేటాయింపు విషయమై  ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. క్లియర్ టైటిల్ ఉన్న భూమిగా కలెక్టర్  పేర్కొన్నారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ ఈ విషయాలను పేర్కొన్నారు.

Budget 2024: 'విశాఖపట్టణంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత'

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను విశాఖపట్టణంలో ఏర్పాటు చేసేందుకు  డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే  రాష్ట్ర ప్రభుత్వం భూమిని తమకు కేటాయిస్తే  ఈ పనులు ప్రారంభిస్తామన్నారు. 

అయితే రైల్వేశాఖకు  నెల రోజుల క్రితమే ఈ విషయమై  లేఖ పంపినట్టుగా విశాఖపట్టణం కలెక్టర్  స్పష్టం చేశారు. ఈ విషయమై  రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కూడ  ఫోన్ లో కూడ సంప్రదింపులు జరిపిన విషయాన్ని కూడ ఆయన ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సంస్థలు ఇస్తామని  అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీల్లో భాగంగానే  విశాఖపట్టణంలో ప్రత్యేక రైల్వే జోన్ కూడ ఉంది.  అయితే  రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు జరుగుతున్న ఈ చట్టంలో పొందుపర్చిన అంశాలు ఇంకా  అమలు కాని పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం  కేంద్ర ప్రభుత్వం  అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఈ కమిటీ తరచుగా సమావేశాలు నిర్వహిస్తుంది. 


#BZA #GNT #GTL #VSKP #SCOR #ANDHRARAILWAYINFRA #SOUTHCOASTRAILWAY

Translate to English
Translate to Hindi

2 Public Posts - Fri Feb 02, 2024
Page#    42 Blog Entries  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy