Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

There is no more pure joy than RailFanning.

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 5939345
Posted: Jan 12 (07:04)

1 Responses
Last Response: Jan 12 (07:06)
Rail News
39247 views
0

Jan 12 (07:04)   ఎంప్లాయీస్‌ ట్రైన్‌కు ఏమైంది?

NaagendraV   32 news posts
Entry# 5939345   News Entry# 537218         Tags   Past Edits
రాష్ట్ర విభజన తర్వాత.. నూతన ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్‌ నుంచి (ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుస్తోంది) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది....

Rail News
39307 views
1

Jan 12 (07:06)
NaagendraV
NaagendraV   290 blog posts
Re# 5939345-1              
1 compliments
Useful
Article source :
రాష్ట్ర విభజన తర్వాత.. నూతన ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్‌ నుంచి (ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుస్తోంది) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది.

నాడు మేటి రైలు.. నేడు అపరిశుభ్రతకు నెలవుప్రయాణికుల అవస్థలు పట్టని రైల్వేశాఖ
...
more...



ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన తర్వాత.. నూతన ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్‌ నుంచి (ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుస్తోంది) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది. నల్గొండ, గుంటూరు, మంగళగిరి స్టాప్‌లతో విజయవాడకు ప్రయాణించే ఈ రైలుకు.. అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో గుంటూరు, విజయవాడలకు వెళ్లే రైలుగా మంచి ఆదరణ ఉంది. ఎల్‌హెచ్‌బీ బోగీలతో కూడిన ఈ రైలు గతంలో పరిశుభ్రత, నిర్వహణ పరంగానూ మేటిగా ఉండేది. అలాంటి రైలు ప్రస్తుతం నిర్వహణలో నాసిరకంగా ఉందని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. తిరిగి వచ్చే సమయంలో సమయ పాలనా ఉండడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ రైలు నిత్యం వేకువజామున 4.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి విజయవాడకు 10.30కు చేరుతుంది. తిరిగి విజయవాడలో సాయంత్రం 5.30కు బయలుదేరి రాత్రి 10.15 గంటలకు సికింద్రాబాద్‌, 11.20కి లింగంపల్లి చేరుతుంది. గత శుక్రవారం లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్తున్న రైలులోని సి-2 బోగీలో సీటు నంబరు 26 దగ్గర చెత్త ఉందని ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ప్రయాణికులు తెలిపారు. అదే రోజు విజయవాడ నుంచి వచ్చే సమయంలో డి-5 బోగీలోకి నీళ్లు వచ్చాయని వాపోయారు. సాధారణ బోగీలతో పాటు.. ఏసీ బోగీలు కూడా అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయని.. మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

నడుం నొప్పి తెస్తున్న సీట్లు..

ఈ రైలులోని సీట్ల నిర్వహణ కూడా సరిగా లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. వెనక్కు వాల్చినా.. ముందుకు ఒరిగిపోతుండడంతో నాలుగైదు గంటల ప్రయాణానికే నడుం నొప్పి వస్తోందని వాపోతున్నారు. దాదాపు 40 శాతం సీట్లకు ముందు.. కాళ్లు పెట్టుకునే ‘ఫుట్‌రెస్ట్‌’లు లేవని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, 5 గంటల్లో గమ్యస్థానం చేరాల్సిన రైలు.. తిరుగు ప్రయాణంలో కొన్నిసార్లు ఆలస్యంగా నడుస్తోందని పేర్కొంటున్నారు.

#BZA #GNT #GTL #VSKP #SCOR #Southcoastrailway

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy